Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
ఆది ఆంధ్రుడనే ఈ కావ్యం దళిత జీవితానికీ, చారిత్రకేతివృత్తానికీ సమన్వయంగా ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర గత 250- 150 సంవత్సరాల మధ్యకాలంలో చింతపల్లి, తర్వాత అమరావతి రాజధానిగా పాలించిన వాసిరెడ్డి వేంకటాద్రినాయుడి సంస్థానంలో వర్ధిల్లిన భుజంగరాయుడి జీవితానికి సంబంధించిన కథాంశంతో కూడి ఉంది. నాయుడు ప్రేమ మూర్తిగా, రాయుడు విశ్వాస పాత్రుడుగా పెనవేసుకుపోయిన రెండు జీవితాలకు సంబంధించిన గాథ ఇది. ఆంధ్రత్వం మూర్తీభవించిన రాజు కొలువులో దళిత చైతన్యం వెల్లివిరిసిన రాయుడు ఆది ఆంధ్రుల వారసుడై వర్ధిల్లాడు. వీరుడుగా, సేనానిగా, మంత్రిగా, కవిగా, రాజప్రతినిధిగా, రాజుకు సలహాదారుగా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప శాంతమూర్తిగా రాయుడు ప్రత్యక్షమవుతాడు.